
డ్రైవర్ రహిత మెట్రో ట్రయల్ రన్ విజయవంతం
సాక్షి, చైన్నె: ఫేజ్ –2లో భాగంగా చైన్నెలో పూందమల్లి–పోరూర్ మధ్య డ్రైవర్ రహిత మెట్రో రైలు ట్రయల్ రన్ విజయవంతంమైంది. తక్కువ స్పీడ్ నుంచి క్రమంగా పెంచుతూ 9 కి.మీ దూరం సోమ, మంగళవారాలలో ట్రయల్ రన్ను అధికారులు విజయవంతం చేశారు. ఈ రైలులో అధికారులు పర్యటించారు. తొలుత 15 కి.మీ తర్వాత 30 కి.మీ అంటూ క్రమంగా వేగాన్ని పెంచారు. ఈ రన్ విజయవంతం కావడంతో తదుపరి పరిశీలనలతో డిసెంబరు నుంచి ఈ మార్గంలో డ్రైవర్ రహిత మెట్రో సేవలకు కసరత్తులు మొదలెట్టారు. ఇదిలా ఉండగా చైన్నెలో ఏసీ ఎలక్ట్రిక్ రైలు సేవలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మే 2వ తేదీ నుంచి చైన్నె బీచ్ చెంగల్పట్టు, చైన్నె బీచ్ – తాంబరం మధ్య రైలు సేవల వేళల్లో మార్పులు చేశారు.
అదుపులోనే బీపీ, షుగర్
● మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ సమాచారం
కొరుక్కుపేట: తమిళనాడులో రక్తపోటు, మధుమేహం నియంత్రణను మెరుగుపరచడం ద్వారా పీపుల్ సీకింగ్ మెడిసిన్ కార్యక్రమం బెంచ్మార్క్కు చేరుకుంది. తమిళనాడులో జాతీయ ఆరోగ్య ఉద్యమం కింద, ప్రజా సంక్షేమ శాఖ ద్వారా ఎస్హెచ్జీ సభ్యులను సంక్రమించే వ్యాధులను పరీక్షించేందుకు మహిళా ఆరోగ్య వలంటీర్లుగా నియమించడం ద్వారా కమ్యూనిటీ ఆధారిత వైద్య కార్యక్రమం అమలు చేయబడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వరుసగా 8,713 మంది, 2,256 మంది మహిళా ఆరోగ్య వలంటీర్లు ఉప ఆరోగ్య కేంద్రాలకు అనుబంధంగా పనిచేస్తున్నారు. వారు అంటు వ్యాధులను నిర్ధారించడం, రోగులకు కౌన్సెలింగ్ అందించడమే కాకుండా దీర్ఘకాలికంగా వాటిని కూడా అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఇద్దరు బిడ్డలను
హత్య చేసిన తల్లి అరెస్టు
సేలం: సేలం జిల్లా వాళపాడి సమీపంలో ఉన్న అత్తనూర్పట్టి గ్రామానికి చెందిన వ్యక్తి విజయకుమార్(35)–ఇలవరసి(30) దంపతులు. వీరికి విగ్నేష్(6), సతీష్ కుమార్(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ స్థితిలో సోమవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పిల్లలు ఇద్దరు మృతదేహాలుగా కనిపించారు. సమాచారం అందుకున్న విజయకుమార్ బంధువులు ఇద్దరు బిడ్డలను చూసి విలపించారు. కుటుంబ సమస్యల కారణంగా ఇలవరసి తన ఇద్దరు బిడ్డలను హత్య చేసి, మృతదేహాలను సెప్టిక్ ట్యాంకులో విసిరి, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆ వివరాల మేరకు దర్యాప్తు చేపట్టిన వాళప్పాడి పోలీసులు, పిల్లల తల్లి ఇళవరసిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన బంధువుల్లో కలకలం రేపింది.
అంబేడ్కర్ విగ్రహానికి ముసుగు
– కాకలూరులో ఉద్రిక్తత
తిరువళ్లూరు: అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించాలని రెవెన్యూ ఽఅధికారులు ఆదేశా లు జారీ చేయడంతో కాకలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరువళ్లూరు జిల్లా కాకలూరులో గత డిసెంబర్ 14న అంబేడ్కర్ విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన యువకులు ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుకు రెవెన్యూ పోలీసుల అనుమతి లేదు. ఈ నేపథ్యంలో ఇదే విషయం అధికారుల దృష్టికి రావడంతో విగ్రహాన్ని తొలగించడానికి అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ మంగళవారం యత్నించారు. విషయం తెలుసుకున్న యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని విగ్రహన్ని తొలగించవద్దని కోరుతూ వాగ్వాదానికి దిగారు. అయితే అధికారులు విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని స్పష్టం చేయడంతో యువకులు వెనుక్కి తగ్గి తామే విగ్రహాన్ని రెండు రోజుల్లో తీసుకెళ్తామని అధికారులకు హామీ ఇచ్చారు. అనంతరం విగ్రహానికి ముసుగు వేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

డ్రైవర్ రహిత మెట్రో ట్రయల్ రన్ విజయవంతం

డ్రైవర్ రహిత మెట్రో ట్రయల్ రన్ విజయవంతం