నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని చదువుకున్నాం. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తాకట్టుపెట్టడం దురదృష్టకరం. నేను వ్యవసాయంపై ఆధారపడి పైకి వచ్చాను. 2014 నుంచి 2019 వరకు కరువును చూశాం. వర్షాలు లేక ప్రాజెక్టులు ఎండిపోయాయి. జగన్ సీఎం అయిన తరువాత పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఆయన రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలు, రైతులను వెన్నుపోటు పొడిచారు. రైతాంగం తిరగబడి చంద్రబాబును తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
–పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ
●


