ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు

May 28 2024 7:45 AM | Updated on May 28 2024 7:45 AM

ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు

ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు

సంగం: మండలంలోని తలుపూరుపాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ బాద్‌షాపై సోమవారం రాత్రి సంగం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై నాగార్జునరెడ్డి సమాచారం మేరకు.. తలుపూరుపాడుకు చెందిన ఓ బాలిక తరుణవాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ షేక్‌ బాద్‌షా కొంత మంది పిల్లలను ప్రతి నిత్యం తరుణవాయి పాఠశాలకు తీసుకెళ్తుండేవారు. అందులోని ఓ బాలికను ప్రతి నిత్యం తన ముందు కూర్చొబెట్టుకుని అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తూ ఉండేవాడు. అయినప్పటికి ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇటీవల సెలవులు రావడంతో ఈ నెల 25వ తేదీ బాలికను వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉందామని బలవంతం చేశాడు. దీంతో బాలిక ఆమె తల్లిదండ్రులకు విష యం తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement