DuleepTrophy 2022: దుమ్మురేపిన జైస్వాల్.. తొలి మ్యాచ్లోనే డబుల్ సెంచరీ!

దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్లోనే ముంబై యువ ఆటగాడు, వెస్ట్ జోన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతోన్న తొలి క్వార్టర్ ఫైనల్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 321 బంతులు ఎదర్కొన్న జైస్వాల్.. 18 ఫోర్లు, 6 సిక్సర్లతో 228 పరుగులు సాధించాడు. జైస్వాల్ను అభినందిస్తూ.. రాజస్తాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో అతడితో పాటు టీమిండియా వెటరన్ ఆటగాడు, వెస్ట్ జోన్ కెప్టెన్ ఆజింక్యా రహానే కూడా ద్విశతకం సాధించాడు.
228 on his #DuleepTrophy debut. 👌💗
Jaiswal was bemisaal. 💥 pic.twitter.com/4wzmtJ0VP5
— Rajasthan Royals (@rajasthanroyals) September 9, 2022
ఈ మ్యాచ్లో 207 పరుగులు చేసి రహానే ఆజేయంగా నిలిచాడు. మరో వైపు ఓపెనర్ పృథ్వీ షా(113) సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో వెస్ట్ జోన్ రెండు వికెట్లు కోల్పోయి 590 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
— Rockstar MK 🇮🇳 (@RockstarMK11) September 9, 2022
చదవండి: Duleep Trophy 2022: డబుల్ సెంచరీతో చెలరేగిన అజింక్య రహానే...
మరిన్ని వార్తలు