క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ అవార్డుల్లో టీమిండియా ప్లేయర్లు ఆధిపత్యం చాటారు. ఈ ఏడాది తొమ్మిది ప్రధాన అవార్డుల్లో ఏకంగా ఏడు అవార్డులు భారత ఆటగాళ్లకే దక్కాయి. ఐదు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల్లో నాలుగు టీమిండియా ప్లేయర్లే కైవసం చేసుకున్నారు.
క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్
శుభ్మన్ గిల్– గతేడాది ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో 754 పరుగులు, ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో 269 & 161
రవీంద్ర జడేజా– గతేడాది ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో 86 సగటు 516 పరుగులు. మాంచెస్టర్లో మ్యాచ్ సేవ్ చేసిన శతకం.
రిషభ్ పంత్– గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో హెడింగ్లే టెస్ట్లో రెండు శతకాలు (134 & 118), మరో మ్యాచ్లో గాయంతోనూ హాఫ్ సెంచరీ.
మొహమ్మద్ సిరాజ్– గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో 23 వికెట్లు, ఓవల్ టెస్ట్లో చివరి రోజు తొలి సెషన్లో 5 వికెట్లు.
హసీబ్ హమీద్– ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నాటింగ్హామ్షైర్కు 15 ఏళ్ల తర్వాత ఛాంపియన్షిప్. ఈ టోర్నీలో 66 సగటున 1258 పరుగులు.
భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మకు లీడింగ్ వుమెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు లభించింది.
టీమిండియా విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మ లీడింగ్ టీ20 క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డును ఎగరేసుకుపోయాడు.
గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో విశేషంగా రాణించిన భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ విజ్డెన్ ట్రోఫీ (సింగిల్ టెస్ట్ ప్రదర్శనకు) గెలుచుకున్నాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో డబుల్ సెంచరీ, భారీ సెంచరీ సహా 430 పరుగులు చేసి భారత్ను గెలిపించినందుకు గానూ గిల్ను ఈ అవార్డు వరించింది.
ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్కు లీడింగ్ మెన్స్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు లభించింది.


