టాటా ఓపెన్‌ విజేత గ్రీక్‌స్పూర్‌ 

Tata Open 2023: Tallon Griekspoor Clinches Maiden ATP Title - Sakshi

పుణే: భారత్‌లో నిర్వహించే ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్‌ మహారాష్ట్ర (ఏటీపీ 250) శనివారం ముగిసింది. సింగిల్స్‌లో నెదర్లాండ్స్‌ ఆటగాడు గ్రీక్‌స్పూర్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో గ్రీక్‌స్పూర్‌ 4–6, 7–5, 6–3 స్కోరుతో బెంజమిన్‌ బోన్జి (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను కోల్పోయినా...పట్టుదలతో ఆడిన 26 ఏళ్ల గ్రీక్‌స్పూర్‌ తన కెరీర్‌లో తొలి ఏటీపీ టైటిల్‌ సొంతం చేసుకోవడం విశేషం.  

మరో వైపు డబుల్స్‌లో భారత జోడి శ్రీరామ్‌ బాలాజీ – జీవన్‌ నెడుంజెళియన్‌ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాండర్‌ గిల్‌ – జొరాన్‌ వీగన్‌ (బెల్జియం) ద్వయం 6–4, 6–4తో శ్రీరామ్‌–జీవన్‌లపై విజయం సాధించింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top