Ind Vs SA 3rd Test: 5 Runs Penalty For Team India After Pujara Dropped Catch - Sakshi
Sakshi News home page

Ind Vs SA: క్యాచ్‌ మిస్‌ చేసిన పుజారా.. ఐదు పరుగుల పెనాల్టీ

Jan 13 2022 2:52 AM | Updated on Jan 13 2022 10:57 AM

Pujara Dropped Catch Results 5-Runs Penalty For Team India 3rd Test - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా సఫారీలతో మూడో టెస్టులో పుజారా క్యాచ్‌ మిస్‌ చేయడం వల్ల టీమిండియా మూల్యం చెల్లించుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష పడింది. శార్దుల్‌ వేసిన బంతిని బవుమా ఆడగా బంతి మొదటి స్లిప్‌ దిశగా దూసుకుపోయింది. ఆ స్థానంలో ఉన్న పుజారా అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బంతికి అడ్డంగా కుడి వైపునకు వెళ్లిన కీపర్‌ పంత్‌ కూడా క్యాచ్‌ వదిలేశాడు. దీంతో పుజారా చేతికి తగిలిన బంతి పంత్‌ వెనక ఉన్న హెల్మెట్‌ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం సఫారీలకు అంపైర్‌ 5 అదనపు పరుగులు అందించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రాహుల్‌ (10), మయాంక్‌ (7) వెనుదిరగ్గా... కెప్టెన్‌ కోహ్లి (14 బ్యాటింగ్‌), పుజారా (9 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్‌ పడకుండా ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్‌ పీటర్సన్‌ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement