T20 World Cup 2021: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. మొదలైన సందడి.. మీమ్స్‌ హోరు

Memes galore on Social media as fans gear up to Ind vs Pak rivalry Resumption - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌ 2021 లో దాయాదుల పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దాదాపు 28 నెలల విరామం తర్వాత రెండు జట్లు తలపడబోతున్నాయి. దుబాయ్‌ వేదికగా ఆదివారం జరగబోయే ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్నారు. అయితే ఈ ఆసక్తికర పోరుపై భారత అభిమానులు సోషల్‌ మీడియాలో పాకిస్తాన్‌పై మీమ్స్‌ వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటి వరకూ ప్రపంచకప్‌ టోర్నీల్లో ఒక్కసారి కూడా పాక్‌ చేతిలో భారత్ ఓటమి ఎరగకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పాక్ జట్టు కసిగా ఉంది. ఎప్పటిమాదిరిగానే పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలని భారత్‌ ఉవ్విళ్లూరుతోంది. తద్వారా దాయాదిపై విజయం, మెగా టోర్నమెంట్‌లో శుభారంభం చేయాలని వ్యూహాలను రచిస్తోంది. 

చదవండి: T20 WC 2021 ENG Vs WI: కూప్పకూలిన వెస్టిండీస్‌.. 55 పరుగులకే ఆలౌట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top