Ashes Test Series: 74 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. ఆస్ట్రేలియా టార్గెట్‌ 20

Ashes 2021: England All Out For 297 Australia Target 19 Runs 1st Test  - Sakshi

Ahses 2021 AUS vs ENG 1st Test.. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయలక్ష్యం 20 పరుగులు. మూడోరోజు ఆట ముగిసేసమయానికి 220/2 స్కోరుతో పటిష్టంగా  కనిపించిన ఇంగ్లండ్‌ నాలుగోరోజు ఆట తొలి సెషన్‌లో తేలిపోయింది. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్నింగ్స్‌ 73వ ఓవర్లో జట్టు స్కోరు 223 పరుగులు ఉన్నప్పుడు.. 82 పరుగుల చేసిన మలాన్‌ ఔట్‌ కావడంతో ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది.

చదవండి: Nathon Lyon: వికెట్‌ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర

అక్కడి నుంచి ఏ దశలోనూ ఇంగ్లండ్‌ కోలుకోకుండా ఆసీస్‌ బౌలర్లు దెబ్బతీస్తూ వచ్చారు. చివరికి 74 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లను చేజార్చుకుంది. జో రూట్‌ 89 పరుగులు చేయగా.. మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఆసీస్‌ బౌలింగ్‌లో నాథన్‌ లియోన్‌ 4, కామెరాన్‌ గ్రీన్‌, పాట్ కమిన్స్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ తలా ఒక వికెట్ తీశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top