భారత-ఎ మహిళల జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. తొలుత మూడు టీ20ల సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు జరగనుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఈ వైట్బాల్ సిరీస్లు ముగిసిన వెంటనే ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ పర్యటన కోసం భారత-ఎ జట్లను బీసీసీఐ ప్రకటించింది.
అనధికారిక వన్డే, టెస్టు సిరీస్లలో భారత-ఎ జట్టు కెప్టెన్గా సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియా ఎంపికయ్యారు. యస్తిక గత నెలలో జరిగిన చారిత్రాత్మక లార్డ్స్ టెస్టులో అద్భుతమైన సెంచరీతో సత్తాచాటింది. ఇప్పుడు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును నడిపించేందుకు భాటియా సిద్ధమైంది. ప్రియా పునియా, తనీషా సింగ్, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, ఉమా చెత్రీ వంటి ఆటగాళ్లు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక శుభ సతీష్, సుశ్రీ దివ్యదర్శిని, శుచి ఉపాధ్యాయ్, మమత మడివాలలను ప్రత్యేకంగా టెస్ట్ మ్యాచ్ కోసం ఎంపిక చేశారు.
మరోవైపు టీ20 జట్టుకు యంగ్ ప్లేయర్ అనుష్క శర్మ నాయకత్వం వహించనుంది. ఈ టీ20 జట్టులో 22 ఏళ్ల సుజాత డేకి సెలక్టర్లు చోటు కల్పించారు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న సుజాత, బెంగాల్ టీ20 లీగ్లో సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది.
టీ20ల కోసం భారత ఎ జట్టు: అనుష్క శర్మ (కెప్టెన్), సయాలీ సత్ఘరే (వైస్ కెప్టెన్), వృందా దినేష్, సుజాతా డే, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, షిప్రా గిరి , శ్వేతా సెహ్రావత్, ఉమా చెత్రీ (వికెట్కీపర్), తనుజా కన్వెర్, తనుజా కన్వెర్, షణ్మనీల్ మణి, శనిభ్నమ్ మణి, వైష్ణింబ్ మణి, శనినమ్ మణి, జె. దిల్ బహదూర్
వన్డేల కోసం భారత ఎ జట్టు: యాస్తిక భాటియా (కెప్టెన్), అనుష్క శర్మ (వైస్ కెప్టెన్), వృందా దినేష్, ప్రియా పునియా, తనీషా సింగ్, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, ఉమా చెత్రీ (వికెట్కీపర్), మిన్ను మణి, అమన్దీప్ కౌర్, వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, జింటిమణి కలితా, షబ్నం షకీల్, అక్షితా భగత్
నాలుగు రోజుల మ్యాచ్కు భారత ఎ జట్టు: యాస్తిక భాటియా (కెప్టెన్), అనుష్క శర్మ శుభా సతీష్, ప్రియా పునియా, తనీషా సింగ్, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, మమతా మడివాలా (వికెట్ కీపర్), సుశ్రీ దిబ్యదర్శిని, శుచి ఉపాధ్యాయ్, వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, జింటిమణి కలితా, షబ్నం షకీల్, అక్షితా భగత్


