ఇతనిపేరు గాలి పరశురాములు. సిరిసిల్ల. నేత కుటుంబం. 1995లో ఆర్టిస్టుగా జీవితా న్ని ప్రారంభించాడు. 2000 దశకం తర్వాత వచ్చిన ఫ్లెక్సీలతో ఉపాధి కరువైంది. పర్యావరణానికి హాని కలిగించే ఫ్లెక్సీలతో ఉపాధి లేక ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేశా డు. 2011లో నాన్వోవెన్ బ్యాగును చూశా డు. అప్పటికి సిరిసిల్లలో అవి తయారు కావట్లేదు. లోతుగా పరిశీలన జరిపి, ముడిసరుకులు తెచ్చి ఇంట్లోనే రూ.లక్ష పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు తనతో పాటు ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. సిరిసిల్ల, ధర్మపురి, కొండగట్టు తదితర ప్రాంతాల నుంచి ఆర్డర్లు పొందుతూ నాన్ వోవెన్ బ్యాగులు సరఫరా చేస్తున్నాడు.


