వేసవి సెలవుల అనంతరం శుక్రవారం తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మొదటిరోజే పుస్తకాలిస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైంది. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లకు కూటమి ప్రభుత్వం
మరమ్మతులు చేయించకపోవడంతో, తీవ్రమైన ఎండల్లో విద్యార్థులు తాగునీరు లేక అల్లాడిపోయారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో తొలిరోజు హాజరు కూడా వెలవెలబోయింది. ప్రకాశం జిల్లాలో 1508 స్కూళ్లలో 97,682 మందికి గాను 43,763 మంది హాజరయ్యారు. మార్కాపురం జిల్లాలో 1330 స్కూళ్లలో 90,115 మందికిగాను 46515 మంది మాత్రమే బడిబాట పట్టారు. – సాక్షి నెట్వర్క్
తాగునీటి కొరత
హెచ్ఎంపాడు స్కూల్లో పనిచేయని ఆర్వో
కొనకనమిట్ల జెడ్పీ స్కూల్లో
పని చేయని ఆర్వో ప్లాంట్
పామూరు ఎస్టీ కాలనీలో
చిరిగిన బ్యాగులతో విద్యార్థులు


