ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సహకార రంగం మూగబోతోంది. పీఏసీఎస్ సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగడంతో వ్యవసాయరంగం కుదేలవుతోంది. ఉమ్మడి జిల్లాలోని 173 సహకార సంఘాలకు తాళాలు వేయడంతో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఐదు రోజులుగా తలుపులు తెరుచుకోకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 122 ఏళ్ల చరిత్ర కలిగిన సహకార రంగం ప్రస్తుతం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని, సంఘాలను బలోపేతం చేసేందుకు సంస్కరణలు చేస్తున్నామని చెబుతున్నా, ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


