పక్షులతో సందడి
పక్షులను తామంతా కంటికి రెప్పలా కాపాడుకుంటామని, గ్రామంలోని చిన్న పిల్లలను సైతం అవి ఏమీ చేయవని, పక్షుల జోలికి ఎవరు వెళ్లినా సహించేది లేదని గ్రామస్తులు తెలిపారు. ఆరేళ్ల క్రితం అర్ధరాత్రి చెట్లపై నిద్రిస్తున్న పక్షులను పథకం ప్రకారం వేటగాళ్లు పట్టుకొని గోతాల్లో వేసి తరలిస్తుండగా తోటి పక్షుల అరుపులకు తామంతా ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి వేటగాళ్లను అడ్డుకుని పక్షులను రక్షించినట్లు చెప్పారు. గోతాల్లో వేసి కుక్కడంతో 25 పక్షులు చనిపోయాయని, గాయపడిన పక్షులను స్థానిక పాఠశాలలో ఉంచి సపర్యలు చేసినట్లు వివరించారు.


