నాలుగు ఎకరాలు మిరప సాగు చేసి దున్నేశాః
నేను నాలుగు ఎకరాల్లో మిరప సాగు చేశా. కాయలు కూడా కాశాయి. పంటను తామర పురుగు ఆశించింది, ఎన్నో రకాల మందులు పిచికారీ చేశా. పైరు తిప్పుకోలేదు. పంట ఎదుగుదల సైతం నిలిచిపోయింది. ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర కల్పిస్తారనే నమ్మకం పోయింది. గత ప్రభుత్వంలో క్వింటా మిరపకాయలు రూ.24 వేల నుంచి రూ.25 వేలకు అమ్ముకున్నా. కూటమి ప్రభుత్వంలో రోజురోజుకు ధర తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో పోయిన సంవత్సరం పండించిన కాయలకు రేటు పెరుగుతుందేమోనని గుంటూరులోని ఏసీ గదుల్లో దాదాపు సంవత్సర కాలం పాటు 100 క్వింటాల స్టాక్ పెట్టా. చివరకు క్వింటా రూ.12 వేలకు అమ్ముకున్నా. ఆ పరిస్థితి చూసి ఈ నాలుగు ఎకరాలు చెడగొట్టి పొగాకు సాగుచేస్తున్నా.
– సూరే కృష్ణారెడ్డి, రైతు, మర్రిపూడి


