‘108 అంబులెన్సులు ఎక్కడికి పోయాయి’: వైఎస్‌ షర్మిల | YS Sharmila Question Kcr About 108 Ambulance | Sakshi
Sakshi News home page

‘108 అంబులెన్సులు ఎక్కడికి పోయాయి’: వైఎస్‌ షర్మిల

May 13 2021 3:52 AM | Updated on May 13 2021 3:54 AM

YS Sharmila Question Kcr About 108 Ambulance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహానేత, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎవరైనా ఆపద ఉందని ఫోన్‌ కాల్‌ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే108 అంబులెన్సులు ఇప్పుడు ఎక్కడికి పోయాయని సీఎం కేసీఆర్‌ను వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కరోనా మృతదేహాలను తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌ వాళ్లు నాలుగు రెట్లు అడ్డగోలుగా దోచుకుంటున్నది మీకు కన్పించట్లేదా అని బుధవారం ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement