రాహుల్​ గాంధీ అసత్య ప్రచారాలు మానుకోవాలి: హర్​ సిమ్రత్​ కౌర్​ బాదల్

Who Picked Rahul Gandhi's Pocket At Golden Temple Asks Harsimrat Kaur - Sakshi

చండీగఢ్: కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు హర్​ సిమ్రత్​ కౌర్​ బాదల్​ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్విటర్​ వేదికగా మండిపడ్డారు. కాగా, రాహుల్​ గాంధీ గత బుధవారం పంజాబ్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమృత్​ సర్​లోని స్వర్ణ దేవాలయం​ను సందర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్​  తన జేబులో నుంచి చోరీ  జరిగినట్లు వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఈ ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై హర్​సిమ్రాత్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్​ గాంధీ.. ఒక జెడ్​ క్యాటగిరి భద్రతను కల్గిఉన్నారని.. ఆయనతోపాటు పంజాబ్​ సీఎం చన్నీ, డిప్యూటి సీఎం సుఖ్ జీందర్​ సింగ్​ రంధావా, ఓపీ సోనిలుకూడా ఉన్నారన్నారు. ఇలాంటి చోట చోరీ జరగటం ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన ప్రదేశానికి చెడ్డపేరు తెచ్చేల వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు.

భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా ప్రవర్తించకూడదన్నారు.  అసత్య ప్రచారాలు మానుకోవాలని రాహుల్​కు చురకలంటించారు. అయితే, రాహుల్​ ఆరోపణలపై.. పూర్తి వివరాలను వెల్లడించలేదని ఎంపీ హర్​సిమ్రాత్​ కౌర్​బాదల్​ అన్నారు. కాగా, రాహుల్​ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం రోజు జలంధర్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవిషయం తెలిసిందే. 

హర్​ సిమ్రాత్​ వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్​ సింగ్​ సుర్జేవాలా ఆమె పోస్ట్​కు రీట్వీట్​ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం అపచారమని  అన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా బాధ్యతతో, పరిపక్వతతో ప్రదర్శించాలని తెలిపారు. గతంలో నరేంద్రమోదీ  తీసుకువచ్చిన చట్టాలు.. రైతుల జేబులు కొట్టడం లాంటివేనని అన్నారు.

చదవండి: ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top