ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కిమ్ జాంగ్లా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బీజీపీపై విమర్శలు సంధించారు రేవంత్.
‘నార్త్ కొరియా తరహాలో ఏక పార్టీ ఎన్నికలు పెడుతున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. లేని బలంతో మూడో అభ్యర్థిని పెట్టడం అంటేనే బీజేపీ ముందుగానే కుట్రలకు తెరలేపిందనేది అర్థమవుతుంది. బిజెపి కుట్రను డైవర్ట్ చేసేందుకు, కాంగ్రెస్ కోవర్టులని దుష్ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించారు.


