
పీర్జాదిగూడలో ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం
పోలీసు నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని అడ్డుకోలేవు
సాక్షి, హైదరాబాద్: ప్రజలు, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం పాల్ప డుతున్న వేధింపులకు మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. కక్ష సాధింపుతో మేడ్చ ల్ జిల్లా పీర్జాదిగూడలో ప్రజలు కట్టుకుంటున్న ఇళ్లను కూలగొట్టిన వ్యవహారంపై విచారణ జరపా లని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాందాస్గౌడ్, జగదీశ్వర్రెడ్డి, కార్పొరేటర్ అమర్సింగ్ కుటుంబం ఈ ప్లాట్లను విక్రయించగా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని గుర్తు చేశారు.
దీనిని పట్టా భూమిగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ ఇవ్వగా, మున్సిపల్ అధికారులు కూడా అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో అనేక మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తుండగా, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏం ఆశించి సోమవారం ఈ ఇళ్లను కూల్చివేయించారో విచారణ చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎంకు సోదరుడిగా చెప్పుకుంటూ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న చేస్తున్న అరాచకాలపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలని రేవంత్కు కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాట్ల యజమానులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు.