సీఎం రేవంత్‌ రైతులకు క్షమాపణ చెప్పాలి | CM Revanth should apologize to farmers says ktr | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ రైతులకు క్షమాపణ చెప్పాలి

May 29 2025 1:06 AM | Updated on May 29 2025 1:06 AM

CM Revanth should apologize to farmers says ktr

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించాలి 

ఎన్‌డీఎస్‌ఏ నివేదిక అశాస్త్రీయం

దీనిపై ఎల్‌అండ్‌టీ ప్రకటన కాంగ్రెస్, బీజేపీకి చెంపపెట్టు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌ విషయంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చేసిన వాదనలు తప్పులతడక అని తేలిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పో­లవరం ప్రాజెక్టు తరహాలో మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించా­లన్నారు. నాణ్యత లేనిది కాళేశ్వరం ప్రాజెక్టులో కాదని, కాం­­గ్రెస్, బీజేపీలే చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆయ­న మండిపడ్డారు. 

కనీస నాణ్యత పరీక్షలు చేయకుండా, శాస్త్రీ­యడేటాను సేకరించకుండా ఎన్‌డీఎస్‌ఏ రూపొందించిన ని­వే­­దికను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ తిరస్కరించడ­మే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. లండన్‌ పర్యటనలో ఉన్న కేటీఆర్‌ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశా­రు. బీఆర్‌ఎస్‌ను బదనాం చేసేందుకు, పార్టీని దెబ్బతీసేందుకు ఎన్‌డీఎస్‌ఏ ఈ నివేదిక ఇచ్చిందని మండిపడ్డారు.  

ఎన్‌డీఎస్‌ఏ నివేదిక బూటకం  
ఎల్‌అండ్‌టీ తాజా ప్రకటనతో మేడిగడ్డ బరాజ్‌పై ఎన్‌డీ­ఎస్‌­ఏ ఇచి్చన నివేదిక బూటకమని బయట పడిందని కేటీఆర్‌ అన్నారు. ఊహాజనితమైన నివేదికను క్రూర రాజకీయ ఎజెం­డా­తో కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో తయారు చేశారని మండిపడ్డారు. పనికిరాని ఆ నివేదిక తమకు ప్రామాణికమని సీఎం రేవంత్‌ చెప్పడం ప్రభుత్వ అసమర్థ, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. 

రేవంత్‌ నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంట ఎండి, 500మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికను ఎల్‌అండ్‌టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కేటీఆర్‌ అన్నారు.  

ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత 
తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని కేటీఆర్‌ అన్నారు. లండన్‌ పర్యటనలో ఉన్న ఆయన బీఆర్‌ఎస్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ నేతలతో సమావేశమయ్యారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) లోనూ పార్టీ రజతోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. 

అలాగే అమెరికాలోని డాలస్‌ నగరంలో జూన్‌ 1వ తేదీన సిల్వర్‌ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో త్వరలో యూకేలోను సంబరాలు నిర్వహిస్తామని, ఈ సంబరాలకు స్వయంగా తాను హాజరు కావడంతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు, తెలంగాణ కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వస్తారని కేటీఆర్‌ తెలిపారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ చేస్తున్న దోపిడీ, అరాచకాలు, ప్రజలపై వేధింపులను బాగా ఎండగడుతున్నారని యూకే ఎన్‌ఆర్‌ఐ నేతలను కేటీఆర్‌ ప్రశంసించారు. ఇంగ్లండ్‌లో ఉన్న సోషల్‌ మీడియా వారియర్స్‌పై కూడా అక్రమ కేసులు పెట్టినా ఎక్కడా తగ్గకుండా రేవంత్‌ ప్రభుత్వ దాషీ్టకాలను ప్రశ్నిస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ ప్రగతికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా పనిచేయాలని వారికి విజ్ఞప్తి చేశారు.  

అనిల్‌ కూర్మాచలంకు పరామర్శ  
గుండెకు సంబంధించిన అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేయించుకుని లండన్‌లో కోలుకుంటున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు, ఫిలిమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అనిల్‌ కూర్మాచలంను కేటీఆర్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్యస్థితిపై వాకబు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement