సాక్షి. హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగడంతో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా క్యూలు కట్టారు. ప్రజలు భయాందోళన చెందడంతోనే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. సుమారు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా: గుడివాడ పట్టణంలో పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి. బంక్ల వద్ద నో పెట్రోల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గుంటూరు సిటీలో పెట్రోల్ లేక బంక్లు మూతపడుతున్నాయి. నగరంలో 8 పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి. పెట్రోల్ కోసం జనం బారులు తీరారు. ప్రభుత్వం అంతా బానే ఉందని చెప్తోంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే దారుణంగా ఉందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే గ్యాస్ దొరకట్లేదని.. నూనె ధరలు పెరిగాయని.. ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


