చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్‌ | Dadisetti Raja Serious Comments On Chandrababu And Nara Lokesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్‌

Feb 17 2023 4:45 PM | Updated on Feb 17 2023 5:02 PM

Dadisetti Raja Serious Comments On Chandrababu And Nara Lokesh - Sakshi

సాక్షి, కాకినాడ: ఫ్రస్ట్రేషన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబును పిచ్చాస్పత్రికి పంపించాలని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. చంద్రబాబుకు గతంలోనే ప్రజలు బుద్దిచెప్పారని కామెంట్స్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. 

కాగా, మంత్రి దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనస్సుల్లో సీఎం వైఎస్ జగన్‌ నిలిచిపోయారు. ప్రజలకు ఏరోజూ వాస్తవాలు చెప్పే అలవాటు చంద్రబాబుకు లేదు. తూర్పుగోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. 2024 ఎన్నిల్లోనూ టీడీపీకి ప్రజలు తగిన బుద్ధిచెబుతారు. చంద్రబాబును మెంటల్‌ ఆసుపత్రికి పంపించాలి.  నారా లోకేష్‌ది తెలంగాణ డీఎన్‌ఏ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement