కాళేశ్వరం ఏటీఎంలతో కాంగ్రెస్‌ వినూత్న ప్రచారం | Telangana Congress unveils 'Kaleshwaram ATM' to criticize BRS, KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ లక్ష కోట్ల నోటు.. కాళేశ్వరం ఏటీఎంలతో కాంగ్రెస్‌ ప్రచారం

Oct 31 2023 9:21 AM | Updated on Oct 31 2023 10:02 AM

Congress Party Kaleshwaram Project KCR ATMs Viral - Sakshi

కాళేశ్వరం కరప్షన్‌ రాకెట్‌ బ్యాంక్‌ వారి.. కాళేశ్వరం కరప్షన్ రావు ఏటీఎంలను అక్కడక్కడ ఏర్పాటు చేశారు.. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ వినూత్న రీతిలో ప్రచారం చేసుకుంటోంది. అధికార బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించే క్రమంలో వెరైటీ కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న హస్తం.. ఇప్పుడు ఆ ఆరోపణలనూ ప్రచారానికి వాడుకుంటోంది.

తాజాగా.. కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించి ప్రచారంలోకి దిగింది కాంగ్రెస్‌ పార్టీ. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం‍ద్రశేఖర్‌రావు ఫొటోతో కూడిన కాళేశ్వరం ఏటీఎంను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది.

ఆ ఏటీఎంలపై కాళేశ్వరం కరప్షన్ రావు( KCR) పేరుతో వినూత్నంగా కేసీఆర్ ఫొటోను.. కాళేశ్వరం కరప్షన్‌ రాకెట్‌ బ్యాంక్‌.. అలాగే కేసీఆర్‌ పేరుతో లక్ష కోట్ల నోటును రిలీజ్‌ చేసింది. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్‌ కాళేశ్వరం అంటూ ఏటీఎంపై పేర్కొంది కాంగ్రెస్. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement