Sakshi News home page

చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయ్యాయా? 

Published Tue, Mar 12 2024 3:28 AM

Cm Ys Jaganmohan Reddy Tweet On Chandrababu - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్‌లు పెట్టి, ప్రజలకు హామీలు ఇచ్చాయి.

తర్వాత చంద్రబాబు సంతకం చేసిన పాంప్లెట్‌ను ఇంటింటికీ పంపారు. అందులో రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అని, మహిళల రక్షణ కోసం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అని రకరకాల వాగ్దానాలు చేశారు. కానీ అందులో ఇచ్చిన హామీలు అమలయ్యాయా?’ అంటూ సోమవారం ట్వీట్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement