
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం వేళ ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్తో కేటీఆర్ సహా పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజా రాజకీయా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కవిత మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నార అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు.