‘ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు.. వీధి రౌడీలా మాట్లాడుతున్నారు’

AP Minister Buggana Rajendranath Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాఠశాలలు మూసివేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కోవిడ్‌ సమయంలోనూ కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 34 వేల ఉద్యోగాలు ఇస్తే మేం లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాం. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని బాబు అనుకుంటున్నారు’  అంటూ మంత్రి దుయ్యబట్టారు.

‘‘8 రాష్ట్రాల్లో రాజధానిలో కాకుండా హైకోర్టులు వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. రాయలసీమలో కోర్టు పెడతామంటే వద్దంటున్నారు’’ అని మంత్రి దుయ్యబట్టారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఇలా అడ్డుకోవడం సిగ్గు చేటు. రాయలసీమకు చంద్రబాబు ఏం మేలు చేశారో చెప్పాలి. అప్పులపైనా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుతో పోలిస్తే మేం తక్కువ అప్పులే చేశాం. చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారు’’ అని మంత్రి బుగ్గన నిప్పులు చెరిగారు.

‘‘గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చంద్రబాబు బెదిరిస్తున్నాడు. 2019లో ఓడించారుగా ఇంకా ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు. చంద్రబాబు కర్నూలులో ఏమి మాట్లాడారో అర్థం కాలేదు. ఎన్టీఆర్, హరికృష్ణల జీవితాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుది. 73 ఏళ్ల వయస్సులో ఏంటి మాటలు. చంద్రబాబు పూర్తిగా ఫ్రస్టేషన్‌తో ఉన్నారు’’ అని మంత్రి అన్నారు.

చదవండి: అబద్ధాలపై పేటెంట్‌ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top