కోల్సిటీ: రామగుండం అభివృద్ధికి సహకారం అందించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. నే షనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ మంగళవారం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్లు, మే యర్ల ఓరియెంటేషన్ శిబిరంలో పురపాలక పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ఆమెను కలిసి నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఇందుకు శ్రీదేవి సానుకూలంగా స్పందించినట్లు మేయర్ వివరించారు.
ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వాగతం
జ్యోతినగర్: ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ కు మంగళవారం కాంగ్రెస్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్పాషా ఆధ్వర్యంలో బీ–పవర్హౌస్ గడ్డ హనుమాన్ జంక్షన్ వద్ద ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు.


