రోహిణి కార్తె ప్రవేశంతోనే వానాకాలం సీజన్ ఆరంభమైనట్లు రైతులు భావిస్తారు. ప్రస్తుతం మృగశిర కార్తెలో సగం కాలం గడిచిపోయింది. ఈ రెండు కార్తెల్లో అడపాదడపా కురిసిన మోస్తరు వర్షాలతో నేల కాస్త తడిచినా.. ఎండల తీవ్రతతో ఎప్పటిలాగే పొడిగా మారిపోయింది. అయినా, అన్నదాతలు వానదేవుడిని నమ్ముకుని చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, బోర్ల ఆధారంగా పత్తి విత్తనాలు చల్లుతున్నారు. కొందరు వరినారు పోస్తున్నారు. పలు గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో పనులు చేస్తున్న రైతుల దృశ్యాలు ఇవి..
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


