సాగు విస్తీర్ణంలో 77 శాతం అదేపంట
తర్వాతి స్థానాల్లో పత్తి, మొక్కజొన్న
చివరిదశకు చేరిన యాసంగి ధాన్యం కొనుగోళ్లు
వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు
సాక్షి పెద్దపల్లి:
బోనస్ చెల్లిస్తుండడంతో..
జిల్లాలో ఏటా వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఇతర పంటల సాగు తగ్గుతూ వస్తోంది. ఇందు కు కారణం.. వరినాటు సమయంలో తప్పితే మిగ తా పనులన్నీ సులువుగా పూర్తవుతుండడం, ప్రభు త్వం సన్నవడ్లకు క్వింటాలుపై రూ.500 బోనస్ చె ల్లిస్తుండటంతో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఇదేసమయంలో ఇతర పంటలకు సస్యరక్షణ చర్యలు ప్రహసనంగా మారండంతో విత్తడం తగ్గించేస్తున్నారు. కాలం కలిసి వస్తే దిగుబడులు భారీగా రావడంతోపాటు వ్యక్తిగత అవసరాల కో సం మొత్తం సాగులో సగభాగం సన్నరకం వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతుండడం సాగు విస్తీర్ణం పెరగడానికి కారణంగా నిలుస్తున్నది.
వానాకాలం సాగు వివరాలు(ఎకరాల్లో)
వరి 2,15,500
పత్తి 52,094
మొక్కజొన్న 886
కంది 208
పెసర 10
మినుములు 11
పప్పుధాన్యాలు 12
వేరుశెనగ 2
నువ్వులు 16
ఆయిల్పామ్ 3,179
మిరప 133
పసుపు 295
ఆహార 376
ఉద్యాన 5125
ఆహారేతర 415
అవసరమైన విత్తనాలు, ఎరువులు(క్వింటాళ్లలో)
వరి 53,125
మొక్కజొన్న 70.5
కంది 30
పప్పుధాన్యాలు 1.6
యూరియా 31,138
డీఏపీ 3,767
పత్తి(ప్యాకెట్లు) 1,31,250
పంట మార్పిడి పద్ధతి పాటిస్తేనే మేలు
వానాకాలం సీజన్ మరికొద్దిరోజుల్లోనే ప్రారంభం కానున్నది. ఈమేరకు జిల్లాలో సాగు ప్రణాళిక సిద్ధం చేశాం. వరి సాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. ఎప్పుడూ ఒకే పంట కాకుండా ఏటా పంట మార్పిడి పద్ధతి పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. జిల్లా రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరికై నా ఏదైనా సమస్య ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులకు ఫోన్చేసి సలహాలు, సూచనలు పొందవచ్చు. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి


