కోల్సిటీ(రామగుండం): ప్రమాదం జరిగిన గంటలోపు(గోల్డెన్ అవర్) చికిత్స అందితే ప్రాణాలు ద క్కుతాయని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) ఎమర్జెన్సీ విభాగం ఫిజీషియన్ స్వర్ణలత, వైద్య బృందం మనోహర్, మహేశ్, కిరణ్, సౌ మ్య వెల్లడించారు. ‘వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే’ సందర్భంగా బుధవారం జీజీహెచ్లో వైద్య, సి బ్బంది, పేషెంట్లు, బంధువులకు అవగాహన క ల్పించారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, విష ప్రయోగాలు, కాలినగాయాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన వైద్యం అందితే ప్రాణాపాయం తప్పుందని అన్నారు. గాయపడిన వ్యక్తిని అనవసరంగా కదిలించకూడదని, వెంటనే 108కు సమాచారం ఇవ్వాలని, రక్తస్రావం ఉంటే శుభ్రమైన గుడ్డతో ఒత్తిడి చేయాలని, గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని
డాక్టర్ స్వర్ణలత వివరించారు.


