దివ్యాంగుల పింఛన్ మంజూ రు చేయాలని ప్రతీ ప్రజావాణిలో వినతిపత్రం ఇస్తూనే ఉన్న. హైదరాబాదు వెళ్లమంటున్నరు. ఆర్థిక ఇబ్బందులతో అంతదూరం వెళ్లలేకపోతున్న. అధికారులు స్పందించడం లేదు.
– జన్నే రవి, గుంజపడుగు
ఆడపడుచులు వేధిస్తున్నరు
మా ఆయన చనిపోయారు. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ కాకుండా ఆడపడుచులు వేధిస్తున్నరు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నరు. జీవనోపాధి లేదు. బతికేది ఎలా? వ్యవసాయ భూమి మాది మాకు ఇప్పించాలె.
– ఆరెల్లి నందిని, కన్నాల


