చివరిదశలో ఆర్వోబీ పనులు
● మిగిలింది అప్రోచ్ రోడ్డు నిర్మాణమే ● ఎమ్మెల్యేవిజయరమణారావు చొరవతో పూర్తయిన రైల్వేట్రాక్ పైపనులు
పెద్దపల్లిరూరల్: కాజీపేట – బల్హార్షా మధ్య ప్రధాన రైలు మార్గం పెద్దపల్లి నుంచే ఉంది. ప్రతీఅర్ధగంటకో రైలు, పదుల సంఖ్యలో గూడ్స్రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో తరచూ రైల్వేగేట్ మూసివేస్తున్నారు. ట్రాక్కు రెండు వైపులా వందలాది వాహనాలు గంటల తరబడి నిరీక్షిస్తున్నాయి. వాహనదారులు సహనం కోల్పోతున్నారు. ఈసమస్య పరిష్కారం కోసం రైల్వేసేఫ్టీ వర్క్స్ నుంచి రూ.119.50 కోట్ల వ్యయంతో పెద్దపల్లి సమీపంలో చేపట్టిన ఆర్వోబీ పనులను 2022 అక్టోబర్ 10న అప్పటిమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రారంభించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత పనులు చివరిదశకు చేరుకున్నాయి.
ఆర్వోబీ సమాచారం


