జాతీయ రహదారి పనులపై రీ సర్వే ప్రారంభం
ముత్తారం(మంథని): లక్కారంలో నే షనల్ హై రోడ్డు నిర్మాణంలో సర్వం కోల్పోతున్న తమకు పరిహారం చెల్లిస్తేనే భూములిస్తామని పురుగుల మందు డబ్బాలతో నిర్వాసితులు ని రసన తెలిపారు. వీరి వేదనపై ‘మే మం పాపం చేశాం’ శీర్షికన ఈనెల 19న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు రీ సర్వేకు ఆదేశించారు. దీంతో డీఐ రమేశ్బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయినారెన్, సిబ్బంది శనివారం రీ సర్వే ప్రారంభించారు. మూడురోజులుగా ఎన్హెచ్ పనులు జరగకుండా నిర్వాసిత రైతులు టెంట్ కింద కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఈక్రమంలో తహసీల్దార్ మ ధుసూదన్రెడ్డి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా రీసర్వే సాగుతోంది.
జాతీయ రహదారి పనులపై రీ సర్వే ప్రారంభం


