నేటి నుంచి పైడితల్లి జాతర
● భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
రాజాం: ఉత్తరాఽంధ్ర ముత్తైదువుగా పేరొందిన రాజాం పోలిపల్లి పైడితల్లి జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది వందవ జాతర కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణకు దేవదాయశాఖ రూ. 50 లక్షలు మంజూరు చేసింది. ఆలయ ఆవరణలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇరుకుగా ఉన్న రోడ్డును ఇటీవల విస్తరించారు.
విద్యుత్ ధగధగలు..
ఆలయ ఆవరణ నుంచి డోలపేట జంక్షన్, చీపురుపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది 50 వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఉచిత దర్శనంతో పాటు రూ. 20. రూ.50, రూ.100 టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీఐపీ దర్శనాలను నిలిపివేసినట్లు ఈఓ బీవీ మాధవరావు తెలిపారు.
నేటి నుంచి పైడితల్లి జాతర


