గిరిపుత్రుల నుంచి రూ.23 లక్షలు స్వాహా! | - | Sakshi
Sakshi News home page

గిరిపుత్రుల నుంచి రూ.23 లక్షలు స్వాహా!

Jun 17 2025 6:47 AM | Updated on Jun 17 2025 6:47 AM

గిరిప

గిరిపుత్రుల నుంచి రూ.23 లక్షలు స్వాహా!

సీసీ నిర్వాకమే..

2014 నుంచి 2020 వరకు రాయగడ జమ్ము సీసీగా పనిచేసిన వ్యక్తిపైనే మాకు అనుమానాలున్నాయి. ఆయనే నిధులు దుర్విని యోగం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గతంలో సదరు సీసీ బదిలీపై వెళ్లారు. మరలా ప్రస్తుతం ఇక్కడే నియమించారు. గిరిజనులను మోసం చేయ డం దారుణం. సదరు సీసీపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలి.

– మండంగి శ్రీనివాసరావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి

సాక్షి, పార్వతీపురం మన్యం:

వారంతా గిరిపుత్రులు. అక్షరం రాని అమాయకులు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయడమే తెలు సు. అటువంటి వారికీ టోకరా పెట్టారు మన ‘వెలు గు’ సిబ్బంది. గిరిజనులకు రుణాల పేరిట ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.23 లక్షలు వాడేశారు. ఆ సొమ్ముల్లో ఒక్క రూపాయి కూడా ఆ అమాయకులకు వెళ్లలేదు. తీరా, ఇప్పుడు వారి పేరి ట రుణాలు కనిపిస్తే లబోదిబోమంటున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు, రాయగడ జమ్ము, చాపరాయిబిన్నిడి పంచాయతీలకు చెందిన సుమారు 14 మహిళా సంఘాల్లో సీ్త్ర నిధి(టీఎస్‌పీ) రుణాల్లో గోల్‌మాల్‌ చోటు చేసుకుంది. రుణాలు పొందకుండానే, దాదాపు 50 మంది గిరిజనులు రుణాలు పొందినట్లు చూపుతున్నారు. ప్రధానంగా అప్పట్లో సీసీగా పని చేసిన ఓ వ్యక్తిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి 2020 వరకు అతని పని చేసినట్లు గిరిజనులు చెబుతున్నారు. 2016, 2017, 2018 సంవత్సరాల్లో సంఘాల పేరిట సీ్త్రనిధి రుణాలు మంజూరయ్యాయి. రాయగడ జమ్ము ఎస్‌హెచ్‌జీలో 27 మంది, చాపరాయి బిన్నిడి ఎస్‌హెచ్‌జీలో 12 మంది, బాలేసులో 11 మంది పేరిట రూ.23 లక్షలు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. ఆ నిధులు గిరిజనులకు ఇవ్వకుండానే.. ఒక్కొక్కరి పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలు పొందినట్లు చూపుతున్నారు.

అధికారులకు మొర..

తమకు తెలియకుండానే రుణాలు తీసుకున్నారని తెలియడంతో వల్లాడ, చాపరాయిబిన్నిడి, రేగిడి, కర్లగూడ, చినరావికోన గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి తరలివచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి హేమలతను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రుణాల పేరిట టోకరా

వెలుగు సీసీ నిర్వాకమేనా?

గిరిపుత్రుల నుంచి రూ.23 లక్షలు స్వాహా! 1
1/1

గిరిపుత్రుల నుంచి రూ.23 లక్షలు స్వాహా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement