అంతర్రాష్ట్ర రహదారిపై వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర రహదారిపై వినూత్న నిరసన

Jun 18 2025 3:23 AM | Updated on Jun 18 2025 3:23 AM

అంతర్రాష్ట్ర రహదారిపై వినూత్న నిరసన

అంతర్రాష్ట్ర రహదారిపై వినూత్న నిరసన

పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికే రహదారిపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీని బాగుకు ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు వర్షాకాలం రావడంతో ఈ రహదారిపై పాదచారులు సైతం వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో సీపీఎం నాయకులు కొల్లు సాంబమూర్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు చోళ్లపధం గ్రామ సమీపంలో శివాలయం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై మంగళవారం ఇలా ఈత కొడుతూ వినూత్న నిరసన తెలిపారు. చోళ్లపధం సర్పంచ్‌ కోలక తిరుపతి, పలువురు వాహనదారులు మద్దతుగా నిలిచారు.

– కొమరాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement