● జిల్లా సర్వే అధికారి లక్ష్మణరావు
గరుగుబిల్లి: భూముల రీసర్వేను పక్కాగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా సర్వే అధికారి పి.లక్ష్మణరావు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సచి వాలయ సర్వే సిబ్బందితో ప్రత్యేక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా 13 గ్రామాలలో రీసర్వేను నిర్వహించగా, రెండో విడత 30 గ్రామాలలో రీసర్వేను చేపట్టడం జరుగుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో సర్వేను పూర్తిగా పరిశీలించి వెబ్ల్యాండ్లో నమోదు చేయాలన్నారు. తప్పిదాలకు తావు లేకుండా సర్వేను చేపట్టాలన్నారు. గతంలో నిర్వహించిన సర్వేలో వచ్చిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. గతంలో నిర్వహించిన సర్వే కారణంగా మ్యుటేషన్లు చేసేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రీసర్వేలో తప్పుగా నమోదైతే అందుకు సరైన ఆధారాలుంటే సవరించడం జరుగుతుందన్నారు. సర్వే నిర్వహించడంలో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ చిరంజీవి, ఉప తహసీల్దార్ ఎం.రాజేంద్ర, మండల సర్వేయర్ పి.గాంధీతో పాటు పలు వురు సచివాలయ సర్వేయర్లు పాల్గొన్నారు.