
సైన్ంగ్ చెక్కులు.. స్టార్స్కు చిక్కులు!
సాక్షి, పార్వతీపురం మన్యం:
షైనింగ్ స్టార్స్ నగదు పురస్కారం అందుకున్న విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు చిక్కులు తప్ప డం లేదు. స్వయంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పంపిణీ చేసిన చెక్కు లు చెల్లుబాటు కావడం లేదు. చెక్కులపై చేసిన సంతకమే ఇందుకు కారణం. దీంతో తల్లిదండ్రులు... తమ పిల్లలను తీసుకుని బ్యాంకులు, డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. సోమ వారం జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి వచ్చి సదరు చెక్కులను వెనక్కి ఇచ్చారు.
అధికారుల నిర్వాకంతో..
పార్వతీపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఈ నెల 9న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే. పదోతరగతి, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఇన్చార్జి డీఈఓగా ఉన్న రాజ్కుమార్కు ఎఫ్ఏసీ ఇవ్వకుండానే చెక్కులపై సంతకాలు చేయించారు. ఇలా పదో తరగతికి సంబంధించి 95 మందికి మూడు రకాల చెక్కులను పంపిణీ చేశారు. అవి తీసుకుని బ్యాంకులకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులకు షాక్ తగిలింది. అవి చెల్లవని చెప్పడంతో వారంతా డీఈఓ కార్యాలయం చుట్టూ నాటి నుంచి తిరుగుతున్నారు. సోమవారం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు చెక్కులు తీసుకొచ్చి కార్యాలయంలో అందజేశారు. దీంతో కలెక్టర్ సహా, విద్యాశాఖాధికారులు బ్యాంకర్లతో మాట్లాడారు. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు తిప్పిపంపాయి. మరో దారి లేక, అప్పటికే విషయం పెద్దది కావడడంతో మళ్లీ కొంతమందిని డీఈఓ కార్యాలయానికి పిలిపించుకుని నేరుగా నగదు అందజేశారు. రెవెన్యూ స్టాంప్పై సంతకం చేయించుకుని మరీ నగదు ఇవ్వడం గమనార్హం. మంత్రి లోకేశ్ వద్ద పరువు పోతోందేమోనన్న భయంతో విద్యాశాఖాధికారులు సొంత డబ్బులు సర్దుబాటు చేశారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
చెక్కుల్లో సమస్యలు లేవు : కలెక్టర్
షైనింగ్ స్టార్స్ చెక్కుల్లో సమస్యలు లేవని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. 95 మంది పదో తరగతి విద్యార్థులు షైనింగ్ స్టార్ కార్యక్రమంలో చెక్కులు పొందగా.. వారిలో 73 మందికి ఇప్పటికే సర్దుబాటు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు బ్యాంకుల్లో తమ చెక్కులను డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. బ్యాంకు ఖాతాలు లేని మారుమూల, దూర ప్రాంతాల కు చెందిన విద్యార్థులకు నేరుగా చెల్లించే ఏర్పా టును కూడా చేశామని చెప్పారు. జిల్లా విద్యా శాఖ అధికారి ఇటీవల మారడం వల్ల సమస్య ఏర్పడిందన్నారు. ఈ నెల 11వ తేదీ తర్వాత పరిష్కారమైందన్నారు. ప్రస్తుతం చెక్కుల నగదు జమలో ఎటువంటి సమస్యా లేదని చెప్పారు. బ్యాంకుల్లో సమస్య తలెత్తితే జిల్లా రెవెన్యూ అధికారి (83338 13248), జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ (91213 86194) ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు.

సైన్ంగ్ చెక్కులు.. స్టార్స్కు చిక్కులు!