నేలపైనే వైద్యం | - | Sakshi
Sakshi News home page

నేలపైనే వైద్యం

Jun 17 2025 6:47 AM | Updated on Jun 17 2025 6:47 AM

నేలపై

నేలపైనే వైద్యం

అమ్మో.. మలేరియా..!
● సీతంపేట ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి ● ఒకే రోజు 23 మందికి మలేరియా పాజిటివ్‌ ● 349 ఓపీ నమోదు ● ఇందులో జ్వర పీడితులు 91 మంది

గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి నాలుగు రోజులుగా రోగుల తాకిడి పెరిగింది. బెడ్‌లు చాలడం లేదు. ఇద్దరు ముగ్గురికి ఒకే బెడ్‌పైన, వరండాలో నేలపైనే రోగులను ఉంచి వైద్యులు సేవలందిస్తున్నారు. ఇక్కడ గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన ఆస్పత్రి భవ నాన్ని పూర్తిచేసి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావని రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి ఆస్పత్రిలో అద నపు బెడ్‌లువేసి వైద్యసేవలందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆస్పత్రి వరండాలోనే వైద్యసేవలు పొందుతున్న రోగులు

సీతంపేట: ఏజెన్సీలో మలేరియా కేసులు పెరు గుతున్నాయి. గిరిజనుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి ఎక్కువైంది. సీతంపేట ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం 349 ఓపీ నమోదుకాగా, ఇందులో 91 మంది జ్వరపీడితులే. వీరిలో 23 మందికి మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇన్‌పేషెంట్లుగా 39 మంది చేరారు. రోగులందరికీ మెరుగైన వైద్యసేవలందిస్తు న్నట్టు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డి.వి. శ్రీనివాస్‌ తెలిపారు. గిరిజన ప్రజలు కాచిచల్లార్చిన నీటిని తాగాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.

నేలపైనే వైద్యం 1
1/2

నేలపైనే వైద్యం

నేలపైనే వైద్యం 2
2/2

నేలపైనే వైద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement