
కూటమి వెన్నుపోటు
ఏడాదిలో అరాచకాలు,
అక్రమ కేసులు
2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారికంగా పగ్గాలు చేపట్టింది. రాష్ట్రంలో ఏడాది కాలం అవినీతి, అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం మినహా పాలన సాగించలేదన్నారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా నియంత్రించలేకపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఏక్టివిస్ట్లపై అక్రమ కేసులు బనాయించారు. తమ సొంత ప్రయోజనాల కోసం వ్యవస్థలను నిర్వీ ర్యం చేశారని, విద్య, వైద్య రంగాలను పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు.
విజయనగరం:
ఎన్నికల సమయంలో అధికారమే లక్ష్యంగా హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 5 కోట్ల మంది ఆంధ్రులను వెన్నుపోటు పొడిచిందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సూపర్సిక్స్ సహా 143 హామీలు ప్రకటించి నేడు వాటిని అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురి చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి పేదప్రజలంటే లెక్కలేనితనమని, పేదల ను చిన్నచూపు చూడడం దుర్మార్గమని పేర్కొన్నా రు. మూడు రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కూట మి పేరిట పోటీ చేసి గెలిచిన సందర్భంలో ఏడాది ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ ముద్రించిన జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం పూస్తకాన్ని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ ఇతర పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ మేరకు విజయనగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లడుతూ చెప్పారంటే చేస్తారంతే అన్న నమ్మకం వైఎస్జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో ఉందని, అదే చంద్రబాబు నమ్మించి మోసం చేస్తారన్న నమ్మకం మరోసారి రుజువవుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి మిగిలిన నాలుగేళ్లలోనైనా ప్రజలకు ఇచ్చిన హమీల అమలుతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు.
పాలనలో వ్యత్యాసాన్ని గమనించండి
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం మొదటి ఏడాది సాగించిన పరిపాలన, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వ్యత్యాసాలను పుస్తకంలో పొందుపరిచాం. ఏడాది పాలనలో హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో రెండు ప్రభుత్వాల మధ్య తేడాను వివరించాం. ఈ విషయాలను క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ వివరిస్తాం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సోమవారం ప్రతి నియోజకవర్గంలో ఆయా సమన్వయకర్తలు ఈ పుస్తకాలను ఆవిష్కరించనుండగా.. అనంతరం మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి
జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం నిర్ణీత సమయానికి జరగకుంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులతో టెండర్లు ఖరారు చేసి నిర్మాణం ప్రారంభించాం. జీఎంఆర్ సంస్థ పనులు శరవేగంగా చేపడుతోంది. కేవలం పనుల పరిశీలన పేరిట హడావుడి చేయడం కాదు. ముందస్తుగా ప్రకటించిన విధంగా 2026వ సంవత్సరంలో ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరగకుంటే ప్రభుత్వానిదే బాధ్య త. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, ఇప్పిలి అనంత్, అల్లాడ సత్యనారాయణ మూర్తి, శంబంగి వేణు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, కొప్పల వెలమ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ నెక్కల నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏడాదిలో నయవంచన, నమ్మకద్రోహం పేదప్రజలంటే ప్రభుత్వానికి చులకన
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

కూటమి వెన్నుపోటు

కూటమి వెన్నుపోటు