
పది మంది తహసీల్దార్లకు బదిలీ
పార్వతీపురం రూరల్: జిల్లాలో పదిమంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీపై వెళ్లే తహసీల్దార్లు నిర్దేశించిన సమయంలో వారికి కేటాయించి మండలాల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.
ఇద్దరికి ఉద్యోగున్నతి
ఇద్దరు గ్రేడ్–1 వీఆర్వోలు సీహెచ్ భారతమ్మ, బి.శ్రీనివాసరావుకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగో న్నతి కల్పిస్తూ శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ మేరకు వారిని కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.