మంత్రి వస్తున్నారని మెరుగులు | - | Sakshi
Sakshi News home page

మంత్రి వస్తున్నారని మెరుగులు

Jun 9 2025 7:43 AM | Updated on Jun 9 2025 7:43 AM

మంత్ర

మంత్రి వస్తున్నారని మెరుగులు

పార్వతీపురం రూరల్‌: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్‌ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం పర్యటించనున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో దెబ్బతిన్న రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. అలాగే డివైడర్లకు రంగులు అద్దుతున్నారు. శిథిలావస్థకు చేరిన రోడ్లతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు లోకేష్‌ పర్యటనతో అప్రమత్తమయ్యారు. మెరుగులు దిద్దే పనుల్లో బిజీ అయ్యారు. వెంకంపేట – చినబొండపల్లి గ్రామాల మధ్య మధ్య మంత్రి లోకేష్‌ పార్టీ కేడర్‌తో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. ఆ మార్గంలో గుంతలను పూడ్చి రహదారిపై మెరుగులు అద్దారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను సైతం నరికేసి తమ పార్టీ జెండాలు పెట్టుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ముందుగా ఉదయం 11 గంటలకు పదో తరగతి విద్యార్థులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి లోకేష్‌ హాజరు కానున్న క్రమంలో ప్రధాన రహదారిపై డివైడర్లకు మెరుగులు దిద్దారు.

లోకేష్‌ పర్యటన నేపథ్యంలో రహదారులకు తాత్కాలిక మరమ్మతులు

జిల్లా కేంద్రంలో డివైడర్లకు మెరుగులు

మంత్రి వస్తున్నారని మెరుగులు 1
1/1

మంత్రి వస్తున్నారని మెరుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement