పర్లాకిమిడి: స్థానిక జంగంవీధి జంక్షన్ వద్ద గత ఎస్ఎ కల్యాణ మండపంలో గురువాణీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆథ్మాత్మిక ప్రవచనాలను అల్యాన వినయ్కుమార్ రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం గజేంద్ర మోక్ష్యాన్ని వినయ కుమార్ వివరించారు. భాగవతంలో కొన్ని అంశాలు సామాజిక స్థితిగతులను పోల్చుతూ దివ్యంగా ప్రవచనాలు చెప్పారు. అంధ్రప్రదేశ్, ఒడిశాలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేశారు. ప్రవచనాలు వినడానికి వచ్చిన వారికి పాతపట్నం మండలం కాపు గోపాలపురం గ్రామానికి సంజీవ రామదాసు ప్రసాద సేవనం కల్పించారు.
ప్రవచనాలు చెబుతున్న వినయకుమార్


