అడవిలో దంపతులు మృతి | - | Sakshi
Sakshi News home page

అడవిలో దంపతులు మృతి

Jan 24 2025 1:07 AM | Updated on Jan 24 2025 12:33 PM

కొరాపుట్‌: అడవిలో దంపతులు మృతి చెందిన ఘటన కొరాపుట్‌ జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం కొరాపుట్‌ జిల్లా లమ్తాపుట్‌ సమితి నందపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గిరిపుట్‌ గ్రామానికి చెందిన బలరాం గలాయి (22), బల గలాయి (21) మృతి చెందారు. వీరిద్దరూ టీ దుకాణం నడుపుతుంటారు.

 కట్టెలు తేవడానికి అడవిలోనికి వెళ్లగా అక్కడ అడవి పందులను వేటాడడానికి పెట్టిన విద్యుత్‌తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. అడవికి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు అడవిలో గాలించగా మృతదేహాలు దొరికాయి. నందపూర్‌ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేసిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement