
ఉల్లంఘనులను వదలం
మిమ్నల్ని ఎవరూ చూడటం లేదంటూ ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా? అయితే మీకు ఫైన్ పడినట్లే. జయపురంలో ఇటీవల సీసీ కెమెరాల పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అక్కడి నుంచే ఉల్లంఘనులను గుర్తించి జరిమానా విధిస్తున్నారు. శనివారం ఒక్కరోజే 18 మందికి ఫైన్ విధించినట్లు పట్టణ పోలీసు అధికారి రశ్మీరంజన్ దొలాయి ఆదివారం వెల్లడించారు.
– జయపురం