‘సింగపూరు పాఠశాలలో తెలుగుని మాతృభాషా మాధ్యమంగా ప్రవేశపెట్టాలి’ | Singapore: Sri Samskruthika Kala Saradhi Request To Former Vp M Venkaiah Naidu Telugu Language | Sakshi
Sakshi News home page

‘సింగపూరు పాఠశాలలో తెలుగుని మాతృభాషా మాధ్యమంగా ప్రవేశపెట్టాలి’

Oct 20 2022 9:16 PM | Updated on Oct 20 2022 9:17 PM

Singapore: Sri Samskruthika Kala Saradhi Request To Former Vp M Venkaiah Naidu Telugu Language - Sakshi

సింగపూరు పాఠశాలలో తెలుగుని మాతృభాషా మాధ్యమంగా ప్రవేశపెట్టేలా శ్రీ సాంస్కృతిక కళా సారధి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం తరుపు నుంచి సింగపూరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చెయ్యాలని కోరుతూ శ్రీ సాంస్కృతిక కళా సారధి వారి విజయోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి అభ్యర్ధన పత్రం అందించారు.

సింగపూరు నందు దాదాపు 2 శాతం తెలుగు ప్రజలు నివశిస్తున్నారు. తెలుగుని మాతృ భాషలలో ఒకటిగా గుర్తించడం కొన్ని వేల తెలుగు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీ సాంస్కృతిక కళా సారధి, కాకతీయ సాంస్కృతిక పరివారము, తెలుగుదేశం ఫోరం ఆఫ్ సింగపూరు సంస్థల ప్రతినిధులు కవుటూరి రత్న కుమార్, జొన్నాదుల సుధాకర్, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, దామచర్ల అశోక్ కుమార్లు తెలియజేశారు. తెలుగును భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానికి అవసరమైన సాయం తనవైపు నుంచి అందిస్తానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement