పోడు భూముల్లో ఉద్రిక్త వాతావరణం | - | Sakshi
Sakshi News home page

పోడు భూముల్లో ఉద్రిక్త వాతావరణం

Jul 29 2026 2:22 AM | Updated on Jul 29 2026 2:22 AM

భిక్కనూరు: సాగుచేస్తున్న పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతుండటంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాజంపేట మండలం షేర్‌ శంకర్‌తండాలో మంగళవారం జరిగింది. తండాలోని పోడు భూములను పదిరోజులుగా అటవీశాఖాధికారులు దున్నుతున్నారు. తాము భూములు సాగుచేస్తున్నామని ఆన్‌లైన్‌లో తమ పేరిటే భూమి ఉందని తండావాసులు చెప్పినా అటవీశాఖాధికారులు వినకుండా ట్రాక్టర్లతో పోడు భూములను దున్నడం ప్రారంభించారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అధికారులు ఎంత చెప్పినా వినకుండా తమ భూములను దున్నుతున్నారంటు ఆవేదనకు చెందిన సరోజ అనే మహిళా రైతు పురుగుల మందును సేవించింది. దీంతో అక్కడున్న వారు ఆమెను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement