● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి
రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపతిరెడ్డి తెలిపారు. టీయూఎఫ్ఐడీసీ, నుడాకు సంబంధించిన రూ.91 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ప్రజలకు మెరుగైన, మౌలిక వసతుల కల్పనకు నగర పాలక సంస్థ దృష్టిసారించాలని పేర్కొన్నారు. నిజామాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు, స్మార్ట్సిటీ, పట్టణ ప్రణాళిక రూపకల్పనపై చేసిన తీర్మానాలకు నగర పాలక సంస్థ ఆమోదం తెలిపిందని భూపతిరెడ్డి పేర్కొన్నారు.


