ఆర్జీయూకేటీలో ముగిసిన ఓరియంటేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీలో ముగిసిన ఓరియంటేషన్‌

Aug 15 2025 8:33 AM | Updated on Aug 15 2025 8:33 AM

ఆర్జీయూకేటీలో ముగిసిన ఓరియంటేషన్‌

ఆర్జీయూకేటీలో ముగిసిన ఓరియంటేషన్‌

బాసర: ఆర్జీయూకేటీ బాసరలో కొత్తగా చేరిన విద్యార్థుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ గోవర్ధన్‌, ప్రత్యేక అతిథిగా ఓఎస్డీ ప్రొఫెసర్‌ మురళీధరన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో సానుకూల ఆలోచన పెంపొందించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తార్కిక ఆలోచన, సరైన నిర్ణయాలతో అధిగమించగల సామర్థ్యం ప్రతీ విద్యార్థిలో ఉందన్నారు. మీరు ఈ స్థాయికి రావడానికి చేసిన కృషి, నిబద్ధత భవిష్యత్‌లో కూడా మీ విజయాలకు దారితీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్‌ డీన్‌ డాక్టర్‌ విఠల్‌, డాక్టర్‌ మహేష్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి, గజ్జెల శ్రీనివాస్‌, అధ్యాపకులు, సిబ్బంది, నూతన విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement