నర్సాపూర్ (జి): మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్పాం సాగుపై శాస్త్రవేత్త డాక్టర్ బీఎన్ రావు, జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమశాఖ అధికారి బీవీ రమణ మంగళవారం సద స్సు నిర్వహించారు. వేసవిలో నీటి యాజమా న్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. మొదటి సంవత్సరం నుంచి 30 నెలల వరకు వచ్చిన పూత, గెలలు తొలగించాలని తెలిపారు. డైరీలో సూచించినట్లు తప్పనిసరిగా మొక్కలకు పోషకాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూ మయ్య, రాంచందర్, జెడ్పీటీసీ మాజీ సభ్యు డు చిన్న రామయ్య, హార్టికల్చర్ అధికారులు జావీద్పాషా, మౌనిక, ఏఈవోలు గణేశ్, భాగ్యలక్ష్మి, రమ్య తదితరులు పాల్గొన్నారు.